ఆహార భద్రతపై వ్యవసాయ సబ్సిడీల నిర్ణయం ఎఫెక్ట్​

ఆహార భద్రతపై వ్యవసాయ సబ్సిడీల నిర్ణయం ఎఫెక్ట్​

ఇంచోన్​: వ్యవసాయ రంగ సబ్సిడీలను డబ్ల్యూటీవో ఓపెన్​ మైండ్​తో చూడాలని, ఎందుకంటే ఈ అంశం ఆహార భద్రత (ఫుడ్​ సెక్యూరిటీ)తో ముడిపడి ఉన్నదని ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ చెప్పారు. కొవిడ్​మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో  ఎమర్జింగ్​ ఎకానమీల ఆహార భద్రతపై వ్యవసాయ సబ్సిడీల నిర్ణయం ఎఫెక్ట్​ పడుతుందని పేర్కొన్నారు. ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ నిర్వహించిన సెమినార్​లో ఆసియా దేశాల రికవరీ అనే అంశంపై  నిర్మలా సీతారామన్​ మాట్లాడారు.

డబ్ల్యూటీవో ఎంత తొందరగా పరిష్కారం కనుక్కుంటే ప్రపంచానికి అంతే తొందరగా మేలు జరుగుతుందని అన్నారు.  వ్యవసాయ రంగ సబ్సిడీలపై సమస్యలు డబ్ల్యూటీవో ఏర్పాటయిన నాటి నుంచీ ఉన్నాయని ఫైనాన్స్​ మినిస్టర్​ గుర్తు చేశారు. ఈ విషయంలో పెద్ద దేశాల మాటకు ఇచ్చిన విలువను  గ్లోబల్​ సౌత్​ దేశాల మాటకు ఇవ్వడం లేదని విమర్శించారు.  ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాలను కలిపి గ్లోబల్​సౌత్​గా వ్యవహరిస్తున్నారు. డెవలపింగ్​ ఎకానమీలలోని పేద రైతులకు ఇచ్చే వ్యవసాయ సబ్సిడీలను లెక్కించడమే లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో ఫుడ్​, ఫెర్టిలైజర్​ సెక్యూరిటీలు రెండూ చాలా ఇంపార్టెంట్​గా మారాయని నిర్మలా సీతారామన్​ ప్రస్తావించారు.

ఫుడ్​, ఫెర్టిలైజర్ సబ్సిడీలపై మరోసారి కూలంకషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఫుడ్​ సెక్యూరిటీ మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ట్రేడ్​ ఎగ్రిమెంట్లు ఒకే వైపు నడుస్తున్నాయని, దీనికి సొల్యూషన్​ కనుక్కోవాలని సూచించారు.​ ఫుడ్​ సబ్సిడీ లెక్కించే విధానంలో కొన్ని మార్పులు కావాలని డబ్ల్యూటీవోను  ఇండియా చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.