
- బైండోవర్ కు రాత్రి పూట తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ల అత్యుత్సాహం
- మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద బాధితుల బైఠాయింపు
దండేపల్లి, వెలుగు: పోడు సాగు కోసం రిజర్వ్ఫారెస్ట్లోని చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను బైండోవర్ చేసిన ఘటన ఆందోళనకు దారితీసింది. ఫారెస్ట్ఆఫీసర్ల అత్యుత్సాహంపై ఆదివాసీ మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ పరిధి 380 కంపార్ట్ మెంట్ లోని మామిడిగూడ, దమ్మనపేటకు చెందిన ఆదివాసీ మహిళలు ఇటీవల ఫారెస్ట్ లోని చెట్ల పొదలను తొలగించి ఆ భూముల్లో విత్తనాలు నాటారు. దీంతో గత నెల 27న 9 మంది ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు నమోదు చేశారు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తొమ్మిది మంది మహిళలను బైండోవర్ చేసేందుకు తాళ్లపేట ఎఫ్ ఆర్ఓ సుష్మ రావు, సిబ్బందితో వెహికల్లో దండేపల్లి తహసీల్దార్ఆఫీస్కు తీసుకెళ్లారు. రాత్రి అయిందని, తాము రేపు వస్తామని చెప్పినా వినకుండా తీసుకొచ్చారని బాధిత మహిళలు తహసీల్దార్రోహిత్దేశ్పాండే వాహనానికి అడ్డంగా బైఠాయించి నిరసనకు దిగారు. వారికి రెండు గ్రామాలకు చెందిన మరికొందరు మహిళలు మద్దతు పలికారు. తహసీల్దార్ జోక్యం చేసుకుని ఫారెస్ట్సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి వస్తానని చెప్పి మహిళలను ఫారెస్ట్వాహనంలో తిరిగి పంపించారు. రాత్రిపూట మహిళలను బైండోవర్చేయడంపై తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మ రావు వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.