పోలీస్ అమరుల త్యాగం వెలకట్టలేనిది: ఎస్పీ రావుల గిరిధర్

పోలీస్ అమరుల త్యాగం వెలకట్టలేనిది: ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి, వెలుగు: ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమని ఎస్పీ రావుల గిరిధర్​ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. 

రక్తదాన శిబిరం ద్వారా 252 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతలకు ఎస్పీ  ప్రశంసాపత్రం, పండ్లు అందజేసి అభినందించారు. ఏఆర్​ ఏఎస్పీ వీరారెడ్డి, డీసీఅర్బీ డీఎస్పీ  ఉమామహేశ్వరరావు, సీఐలు ఎం కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, నరేశ్, ఆర్ఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, అరవింద్  పాల్గొన్నారు.