
కర్ణాటక: రాష్ట్రంలోని తుమకూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోసకోట నుంచి పావగడకు బయలుదేరిన ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా... 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: