మహబూబ్​నగర్ జిల్లాలో వంద మంది నేతలు బీఎస్పీలో చేరారు

మహబూబ్​నగర్ జిల్లాలో వంద మంది నేతలు బీఎస్పీలో చేరారు

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్​ మున్సిపాలిటీలోని పలు వార్డుల నుంచి ప్రధాన పార్టీలకు చెందిన వంద మంది నేతలు గురువారం పాలమూరు బీఎస్పీ అభ్యర్థి స్వప్న శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్​ అయ్యారు. పార్టీ ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోందన్నారు.

త్వరలో పాలమూరులో పార్టీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య,  వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ALSO READ : పోస్టల్​బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్ హనుమంతు జెండగే