
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరాంఘర్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్లో వీరి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు ఒరిస్సా నుంచి ప్రైవేటు ట్రావెల్స్లో నగరానికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఎండు గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. ఒక్కొక్కరు 2 కిలోల గంజాయిని నగరానికి తీసుకువచ్చారు. నిందితులను అరెస్టు చేసి ఎస్ఓటీ పోలీసులు.. తదుపరి విచారణ కోసం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.