మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో  ఫేక్ కరెన్సీ కేసులో 12 మంది అరెస్ట్

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో  ఫేక్ కరెన్సీ కేసులో 12 మంది అరెస్ట్

లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఫేక్​ కరెన్సీ సర్క్యులేట్​ చేసిన ముఠాలోని 12 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏసీపీ ఆర్  ప్రకాశ్​ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాలలోని పెట్రోల్​ బంక్​లో కారులో రూ.1,500 పెట్రోల్​ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు.

మూడు ఒకే నంబర్​తో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంక్​లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించి, ఏపీలోని కాకినాడకు వెళ్లి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు వెహికల్స్​ను సీజ్​ చేశారు. కానుగంటి క్రాంతి, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాశ్, కోన మధుకర్, సుంక సురేశ్​కుమార్, కమాని అనిల్, బండారి సత్యానారాయణ, రామునాయక్, కందిమల్ల తిరుపతి, గోల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవనబోయిన సంపత్​కుమార్ ను అరెస్ట్​ చేయగా, కాకినాడకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.