ఇస్తామని బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ ప్రకటన
ఇతర కంపెనీల నుంచి కూడా ఆఫర్స్
ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ఫుల్ డిమాండ్
బెంగళూరు: లాక్డౌన్ కారణంతో ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో, ఈ డిమాండ్ ను చేరుకోవడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ఆన్లైన్ గ్రోసర్ బిగ్ బాస్కెట్, దాని ప్రత్యర్థి గ్రోఫర్స్ కొత్తగా 12 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటనలు ఇచ్చాయి. వేర్హౌసెస్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో పనిచేసేందుకు 10 వేల మంది ఆన్గ్రౌండ్ స్టాఫ్ను నియమించుకుంటామని బిగ్ బాస్కెట్ ప్రకటన ఇచ్చింది. వచ్చే కొన్ని రోజుల్లో ఈ నియామకం ఉంటుందని తెలిపింది. గ్రోఫర్స్ కూడా అదనంగా 2 వేల మందిని నియమించుకుంటానని చెప్పింది. కరోనా వైరస్ కారణంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఈ రెండు కంపెనీలకు డిమాండ్ బాగా పెరిగింది. లేబర్ కొరత ఏర్పడటం ఇప్పుడు కంపెనీకి పెద్ద ఆందోళనగా మారిందని బిగ్ బాస్కెట్ కో ఫౌండర్, సీఈవో హరి మీనన్ తెలిపారు. గతేడాది తాము ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడి పెట్టామని, వచ్చే 18 నెలల వరకు తమకు అవసరమైన నిల్వ సామర్థ్యం ఉందని, కానీ ఇప్పుడు వర్క్ ఫోర్స్ ప్రాబ్లమ్గా మారిందని మీనన్ అన్నారు. సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడిపెట్టిన గ్రోఫర్స్ కు కూడా వేర్హౌసెస్లో పనిచేసేందుకు ఉద్యోగులు నియమించుకుంటున్నట్టు తెలిపింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా తాత్కాలిక స్టాఫ్కు డబుల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి.
అందుబాటులో లేని ఉద్యోగులు
లాక్డౌన్ కారణంతో ఈ–కామర్స్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలా మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ కంపెనీలకు పెద్ద మొత్తంలో లేబర్ కొరత ఏర్పడింది. ఇప్పుడు వర్క్ ఫోర్స్ కావాల్సి ఉందని, అందుకే డెలివరీ, వేర్హౌస్ పర్సనల్స్ను నియమించుకుంటున్నామని బిగ్బాస్కెట్ హ్యుమన్ రీసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ తనూజా తివారీ చెప్పారు. బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లు ఆన్గ్రౌండ్ స్టాఫ్ను నియమించుకుంటున్నాయని, కనీసం టాప్ 30 సిటీల్లో డెలివరీ సమస్యలను తీర్చాలనుకుంటున్నామని తెలిపాయి. ఈ కంపెనీలు ప్రస్తుతం వేర్హౌసెస్లో ఆర్డర్లను పిక్ చేసుకుని, లాస్ట్ మైల్కు డెలివరీ చేసేందుకు స్టాఫ్ను
వెతుకుతున్నాయి. ప్రస్తుతం తమ వేర్హౌసెస్ స్టాఫ్లో 65 శాతం మంది మాత్రమే పనిచేస్తున్నట్టు గ్రోఫర్స్ సప్లై చెయిన్ హెడ్ రోహిత్ శర్మ తెలిపారు. అందుకే అదనంగా రెండు వేల మంది కావాలన్నారు. లేబర్ కొరతతో బిగ్బాస్కెట్ కేవలం 40 శాతం కెపాసిటీతో మాత్రమే ఆపరేట్ అవుతోంది. లేబర్ కొరత పరిష్కారమయ్యాక, మరిన్ని ఆర్డర్లను డెలివరీ చేస్తామని ఈ కంపెనీలు చెబుతున్నాయి. మీనన్ చెప్పిన లెక్కల ప్రకారం, రోజుకు 90 వేల ఆర్లర్లను బిగ్ బాస్కెట్ డెలివరీ చేస్తోంది. లాక్డౌన్కు ముందు ఇది లక్షా 60 వేల ఆర్డర్లను డెలివరీ చేసేది. లార్జ్ ఫార్మాట్ ఆఫ్లైన్ రిటైలర్స్ కూడా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. స్పెన్సర్స్ రిటైల్, నేచర్ బాస్కెట్ వంటివి స్టోర్, డెలివరీ స్టాఫ్కోసం వర్చువల్ ఇంటర్వ్యూ లు కండక్ట్ చేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ అందుబాటులో ఉన్న ఫ్యాషన్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వర్కర్లను, ఫుడ్, గ్రోసరీ స్టోర్స్లోకి మార్చింది.
For More News..