ఢిల్లీలో దారుణం.. స్కూల్‌లో సీనియర్ల దాడి..12 ఏళ్ల బాలుడు మృతి

ఢిల్లీలో దారుణం..  స్కూల్‌లో సీనియర్ల దాడి..12 ఏళ్ల బాలుడు మృతి

స్కూల్‌లో సీనియర్లు దాడి చేసిన ఘటనలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. జనవరి 11న నార్త్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది సీనియర్లు.. బాలుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రిలో చేరిన ఆ బాలుడు.. తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతూ జనవరి 20వ తేదీన మరణించాడు. 

బాలుడు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహిస్తోంది. చనిపోయిన బాలుడు ఆరో తరగతి చదవుతున్నాడు. తన కొడుకును స్కూల్ లో 9, 10వ తరగతికి చెందిన సీనియర్ విద్యార్థులు దాడి చేశారని.. దాంతో తీవ్రంగా గాయపడిన తన కొడుకు అస్పత్రిలో మృతి చెందాడని ఆ బాలుడి తండ్రి శర్మ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.