
గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని అవుసుల కుంట చెరువు దగ్గర 13 అడుగుల పొడవైన కొండచిలువను సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. చెరువు సమీపంలో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు సాగర్ బృందానికి సమాచారం అందించారు.
వారు కొండచిలువను బంధించారు. అప్పటికే ఉడుమును మింగేసిన కొండచిలువ దానికి కక్కేసింది. కృష్ణ సాగర్ మాట్లాడుతూ ఊరికి దగ్గరగా చెరువు ఉందని, చిన్న పిల్లలను చెరువు వైపు రాకుండా చూసుకోవాలని సూచించారు. చిలక కుమార్ సాగర్, అవినాశ్, కిరణ్, కుమ్మరి బాలస్వామి, భిక్షపతి , నరేందర్, కృష్ణయ్య పాల్గొన్నారు.