క్వింటాల్ పసుపు రూ.13 వేలు

క్వింటాల్ పసుపు రూ.13 వేలు

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి అగ్రికల్చర్ మార్కెట్ లో సోమవారం పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాల్ పసుపు రూ. 13,006లకు అమ్ముడుపోయింది. గత ఐదేళ్ల నుంచి ఇదే రికార్డు స్థాయి ధర కావడం విశేషం. మార్కెట్ కు ఇప్పటివరకు 1,082 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. ఇందులో పసుపు కాడి రకం 718 క్వింటాళ్లు, గోల రకం 271, చురా 94 క్వింటాళ్లు వచ్చాయి. సోమవారం గరిష్ట రేటు రూ.13,006 కాగా కనిష్టంగా రూ. 4,012 పలికింది.