
హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేశ్ మూడు రోజుల కింద హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పురు గ్రామం నుంచి 13 తులాల బంగారాన్ని బ్యాగ్లో పెట్టుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఇప్పల నర్సింగాపూర్ శివారులో ఆ బ్యాగు బైక్ వెనుక నుంచి జారి కింద పడిపోయింది.
రమేశ్ వెంటనే హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే టైంలో ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య–నపీజా దంపతులకు ఆ బ్యాగు దొరికింది. తమకు దొరికిన బ్యాగును వెంటనే పోలీసులకు అప్పగించారు. వారి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు బుధవారం రమేశ్ను పిలిపించి సీఐ కరుణాకర్ సమక్షంలో బంగారాన్ని అప్పగించారు. దంపతుల నిజాయితీని పోలీసులు ప్రశంసించారు.