న్యూఢిల్లీ: దేశంలో కేసులు 14 వేలు దాటాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 915 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా కరోనాకు 486 మంది బలయ్యారు. శుక్రవారం 31 మంది చనిపోయారు. 11,744 యాక్టివ్ కేసులున్నాయి. 2,006 మంది కోలుకోగా, శుక్రవారం 238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేట్ 14 శాతంగా ఉంది. మరణాల రేటు 3.36 శాతం ఉంది. 3,320 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 2,826 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటిదాకా 300 మంది కోలుకున్నారు.
ప్రపంచంలో లక్షన్నర మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా మరణాలు లక్షన్నర దాటాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,50,810 మంది చనిపోయారు. 22,30,439 మంది వైరస్ బారిన పడగా, 5,64,210 మంది కోలుకున్నారు. అమెరికాలో కేసులు 7 లక్షలకు దగ్గరవుతున్నాయి. మొత్తం 6,86,431 మంది వైరస్ బారిన పడ్డారు. మరణాలూ 35 వేల దాటి, 35,578కి చేరింది.