ఇండ్ల జాగల రెగ్యులరైజేషన్​కు 1.47 లక్షల ఆప్లికేషన్లు

ఇండ్ల జాగల రెగ్యులరైజేషన్​కు 1.47 లక్షల ఆప్లికేషన్లు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సర్కారు జాగల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లకు స్థలాల రెగ్యులరైజేషన్​ కింద దాదాపు లక్షన్నరదాకా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,47,268 దరఖాస్తులు వచ్చినట్లు సీఎస్​ సోమేశ్ ​కుమార్​ బుధవారం వెల్లడించారు. ఇందులో 125 చదరపు గజాల్లోపు స్థలాలు ఫ్రీ రెగ్యులరైజేషన్​ చేయనున్నారు. దీనికి 58వ జీవో కింద 87,520 దరఖాస్తులు రాగా.. 59వ జీవో కింద 59,748 ఆప్లికేషన్లు వచ్చాయి. రెగ్యులరైజేషన్​ కోసం ఆప్లికేషన్ల స్వీకరణ గురువారంతో ముగియనుంది.