ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు

 ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి.  ఉదయం  10 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా 3 గంటలకు ముగిసింది.  ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓట్లు ఉండగా,  169 ఓట్లు పడ్డాయి.  అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి.   మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.  స్టేడియంలోనే రిటర్నింగ్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.  

ఎన్నికల్లో పోటీ పడుతున్న సభ్యులు వీళ్లే..  

  • ప్రెడిసెంట్: ఏ జగన్మోహన్ రావు, అమర్నాథ్, డాక్టర్ కే అనిల్ కుమార్, పీఎల్ శ్రీనివాస్.
  • వైస్ ప్రెసిడెంట్: సీ బాబురావు, గుండాల శ్రీనివాసరావు, పీ శ్రీధర్, సర్దార్ దల్జీత్ సింగ్
  • సెక్రటరీ: ఆర్ దేవరాజ్, డాక్టర్ ఆర్ హరినారాయణరావు, ఆర్ ఎం భాస్కర్, వీ ఆగమ్ రావు.
  • జాయింట్ సెక్రటరీ: చిట్టి శ్రీధర్, నోయల్ డేవిడ్, సతీష్ చంద్ర శ్రీవాస్తవ, టీ బసవ రాజు.
  • కోశాధికారి: సీజే శ్రీనివాస్ రావు, సీ సంజీవ్ రెడ్డి, గెరార్డ్ కార్, పీ మహేంద్ర.
  • కౌన్సిలర్: డీఏజే వాల్టర్, డాక్టర్ అన్సార్ అహ్మద్ ఖాన్, సునీల్ కుమార్, వినోద్ కుమార్ ఇంగ్లే.