న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‎మెంట్‎లో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది పిల్లలు ఉన్నారు. సుమారు 60 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 19 అంతస్తులున్న అపార్ట్‎మెంట్‎లో రెండు, మూడో అంతస్తులో మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్‎మెంట్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. చాలా మంది ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 200 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరి మంటలు ఆర్పాయి.