న్యూఢిల్లీ: కరోనా బారిన పడినోళ్లు కోలుకుంటున్నారు. కేసులతో పాటే రికవరీలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 20,51,407 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు 51,39,917కు చేరాయి. కేసులతో పోలిస్తే రికవరీ రేట్ 39.91 శాతంగా ఉంది. 3,31,707 మంది చనిపోతే.. డెత్రేట్ 6.45%. రికవరీలు, మరణాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశం మెరుగైన స్థానంలో ఉంది. దేశంలో 48,540 మంది కోలుకున్నారు. రికవరీ రేట్ 41శాతం ఉంది. గురువారం 3,118 మంది డిశ్చార్జి అయ్యారు. గురువారం 148 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,584కి పెరిగింది.
మరణాల రేటు 3 శాతం. ప్రపంచ డెత్రేట్6.45%తో పోలిస్తే ఇండియా మెరుగైన స్థానంలో ఉంది. సరైన టైంలో కేసులను గుర్తించడం, మెడికల్ సౌకర్యాలతోనే మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. ఇప్పటిదాకా 2,300 మంది కరోనా పేషెంట్లు ఆయుష్మాన్ భారత్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకున్నారని, నెలన్నర రోజుల్లో ఆయుష్మాన్ భారత్ కింద కరోనా టెస్టులు చేయించుకున్నోళ్లలో 3 వేల మందికి పాజిటివ్ వచ్చిందని ఆయుష్మాన్ భారత్, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఇందూ భూషణ్ తెలిపారు. దేశంలో మరోసారి రికార్డుస్థాయిలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గురువారం 6,025 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో దేశంలో కేసుల సంఖ్య 1,18,222కి పెరిగింది. అంతకుముందు మంగళవారం ఒక్కరోజే 6,154 కేసులు రికార్డయ్యాయి.