కరోనా కేసులు తగ్గినయ్

కరోనా కేసులు తగ్గినయ్

కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య చూస్తే ఆ వైరస్‌ బారి నుంచి ఇప్పుడిప్పుడే చైనా తేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం కేవలం 394 కేసులే నమోదైనట్టు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. అంతకుముందు రోజుతో నమోదైన 1,700 కేసులతో పోలిస్తే చాలా వరకు తగ్గింది. వైరస్​ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో పోలిస్తే డిశ్చార్జ్​ అయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 16,155 మంది పేషెంట్లను ఆస్పత్రుల నుంచి పంపించినట్టు అధికారులు చెబుతున్నారు.అయితే, మొత్తం కేసుల సంఖ్య 74,576కి పెరిగింది. వైరస్​తో చనిపోయిన వారి సంఖ్య 2,118కి చేరింది. బుధవారం ఒక్కరోజే 114 మంది వైరస్​తో చనిపోయారు. బుధవారం 1,779 మందిని హాస్పిటళ్ల నుంచి ఇంటికి పంపించారు.