- రాష్ట్ర సర్కార్, ప్రైవేటు కంపెనీల సహకారంతో నిర్వహణ
- కోల్ బెల్ట్ లో ఇప్పటివరకు ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు
- జాబ్ మేళాలకు తరలివచ్చిన 75,465 మంది నిరుద్యోగులు
- ఇంటర్వ్యూల్లో ఎంపికైన 26,565వేల మందికి ఉద్యోగ, ఉపాధి
కోల్బెల్ట్, వెలుగు: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి జాబ్మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర సర్కార్, ప్రైవేటు సంస్థల సహకారంతో ఏడు నెలల్లోనే 8 జాబ్మేళాలను నిర్వహించింది. సుమారు 250 ప్రముఖ పైవేటు కంపెనీల్లో 26,565 వేల మంది అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించింది. ఏడో తరగతి నుంచి పోస్ట్గ్రాడ్యుయేషన్ చదివిన సుమారు 75,465 మంది అభ్యర్థులు మేళాల్లో పాల్గొని విద్యార్హతకు తగిన జాబ్ లు పొందారు. మెగా జాబ్మేళాల ఏర్పాటు, నిర్వహణలోనూ సింగరేణి అన్నితానై వ్యవహరిస్తుంది. భవిష్యత్ లో మరిన్ని జాబ్మేళాల నిర్వహణకు ముందుకెళ్తోంది.
నిరుద్యోగుల వద్దకే కంపెనీలు..
తెలంగాణలో సింగరేణి ప్రాంతం ప్రధాన ఉపాధి వనరు పేరుంది. ప్రధానంగా కోల్బెల్ట్ఏరియాలో బొగ్గు గనులు చాలావరకు మూతపడడంతో ఉన్నత చదువులు చదివిన కార్మికుల పిల్లలకు సరైన ఉపాధి లభించడం లేదు. దీంతో సింగరేణి మెగా జాబ్మేళాల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్నుంచి ప్రముఖ కంపెనీలను తీసుకొస్తోంది. అర్హతలకు తగిన జాబ్ లను ఎంచుకునేలా నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర సర్కార్సంకల్పా నికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. మెగా జాబ్మేళాలను సక్సెస్చేస్తోంది. తొలిసారిగా పలు పట్టణాల్లో మెగా జాబ్మేళాలను ఒక ఉత్సవంలా నిర్వహిస్తోంది.
అన్ని సదుపాయాలు కల్పిస్తూ..
రాష్ట్ర సర్కార్, తెలంగాణ డిజిటల్ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సింగరేణి కాలరీస్సహకారంతో కోల్బెల్ట్ ఏరియాలో మెగా జాబ్మేళాలను నిర్వహిస్తూ.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, పోలీస్,పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. మేళాకు వచ్చే నిరుద్యోగులకు ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను సమకూర్చుతోంది. వేలాదిగా యువత అప్లికేషన్లను ఆఫ్లైన్,ఆన్లైన్లో చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది. రిజిస్ర్టేషన్సమయంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయిస్తోంది.
జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ కుండా హెల్ప్డెస్క్లను కూడా ఏర్పాటు చేస్తోంది. కంపెనీల వివరాలను కేటగిరి వారీగా ఫ్లెక్సీలో ప్రదర్శి స్తోంది. జాబ్ మేళాలపై ప్రచారం కూడా చేస్తూ.. అభ్యర్థులతో ఇంటర్వ్యులు, సెలక్షన్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పా ట్లు అందుబాటులో ఉంచుతోంది. జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులకు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజ నం వసతి కూడా కల్పిస్తోంది. ఏప్రిల్లో నుంచి ఇప్పటివరకు 8 మెగా జాబ్మేళాలను విజయవంతంగా నిర్వహించింది.
నిరుద్యోగుల వద్దకే కంపెనీలను తీసుకొస్తున్నాం
నిరుద్యోగులు అర్హత కలిగిన జాబ్ లను పొందేందుకు మెగా జాబ్మేళాలను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్నుంచి ప్రముఖ కంపెనీలను తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మా వంతు సహకారం అందిస్తున్నాం. మెగా జాబ్మేళాల ద్వారా ప్రైవేటుసెక్టార్ లో కూడా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. మరిన్ని ప్రాంతాల్లో మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాం.
– ఎన్.బలరాంనాయక్, సింగరేణి సీఎండీ
హెచ్ఆర్ జాబ్ వచ్చింది
హైదరాబాద్కు చెందిన కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ రావడం సంతోషంగా ఉంది. బెల్లంపల్లిలో నిర్వహించిన మెగా జాబ్మేళా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కోల్బెల్ట్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి జాబ్మేళా నిర్వహించడం, రాష్ట్ర సర్కార్, సింగరేణి ప్రోత్సాహం బాగుంది.
-రేణికుంట్ల సోనీ, మంచిర్యాల జిల్లా
మెగా జాబ్మేళాలు ఇలా..
స్థలం తేదీ అభ్యర్థులు జాబ్ పొందినవారు
మధిర ఏప్రిల్,21 5,000 2,300
భూపాలపల్లి ఏప్రిల్,27 3,500 2,000
గోదావరిఖని మే, 18 5,100 3,029
వైరా మే, 24 12,000 4,041
హుజుర్నగర్ అక్టోబర్, 25 20,500 4,574
సత్తుపల్లి అక్టోబర్, 26 14,318 4,611
బెల్లంపల్లి అక్టోబర్, 26 6,547 3,095
కొత్తగూడెం నవంబర్, 16 8,500 2,915
