- ఈ డిస్ట్రిక్ట్స్లోనే వైరస్ ప్రభావం బాగా ఎక్కువ
- సగటున 60 నుంచి 85% పాజిటివ్ కేసులు ఇక్కడే
- రికవరీ పర్సంటేజ్, డెత్స్రేటులో కూడా ఇవే టాప్
- తాజా స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చి మూడు వారాలకుపైగా గడిచిపోయింది. అయినా ఇప్పటికీ కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. ఒక్కో రాష్ట్రంలో సగటున 69 శాతం(ప్రతి పది కేసుల్లో ఏడు) పాజిటివ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయని తాజా స్టడీలో తేలింది. కేసుల సంఖ్యతో పాటు రికవరీ అయిన వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రికవరీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ(55.55 శాతం) డిశార్జ్ అయిన పేషెంట్లు కూడా ఒక రాష్ట్రంలోని ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. మరణాల విషయానికి వస్తే 63.9 శాతం డెత్స్ కూడా ఈ మూడు జిల్లాల్లోనే రికార్డయ్యాయి. కేంద్రం 25 రాష్ట్రాల్లోని 170 జిల్లాలను హాట్స్పాట్స్గా గుర్తించింది. రాష్ట్రాలవారీగా గుర్తించిన ఈ మూడు జిల్లాలు ఈ లిస్ట్లో కూడా ఉన్నాయి. దీంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే వీలు అధికారులకు కలుగుతోంది.
మూడు జిల్లాల్లో 80 శాతం కేసులు..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లో 4,200 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో ప్రతి రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోనే 80 శాతం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, పుణె, థానే జిల్లాల్లోనే 89.27 శాతం కేసులు రికార్డయ్యాయి. రికవరీ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో 83 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఇక గుజరాత్ విషయానికి వస్తే అహ్మదాబాద్, వడోదర, సూరత్ జిల్లాల్లోనే 84.87 శాతం కేసులు నమోదయ్యాయి. రికవర్ అయిన వారిలో 52.05 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఇక మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొత్తం కేసుల్లో 81.81 శాతం ఇండోర్, భోపాల్, ఖార్గావ్ జిల్లాల్లోనే రికార్డయ్యాయి.
సౌత్లో 63 శాతం..
సౌత్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ విషయమే తీసుకుంటే హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కేసుల సంఖ్య, రికవర్ అయిన వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇదే సీన్ ఉంది. కర్నాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావిలోనూ.. కేరళలోని కాసరగోడు, కన్నూర్, ఎన్నాకుళం జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఈ మూడు జిల్లాల్లో సగటున 63 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే రికవర్ అయిన పేషెంట్లలో 50 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే.
తమిళనాడు మొత్తం కేసులే
తమిళనాడులో కరోనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించింది. టాప్త్రీలో ఉన్న చెన్నై, కొయంబత్తూర్, ఇండస్ట్రియల్ హబ్ తిరుపూర్లో 33.46 శాతమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పర్సెంటేజ్లో కేసులు రికార్డయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్లో పర్సంటేజ్ కాస్త తక్కువగా ఉంది. ఆగ్రా, లక్నో, గౌతం బుద్ధనగర్ జిల్లాల్లో 45 శాతం యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడం వల్ల అక్కడ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అదే బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మూడు జిల్లాల్లో యావరేజ్గా 60 శాతం యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి.
వైరస్ను కంట్రోల్ చేయడం ఈజీ
ఈ మూడు జిల్లాల జోన్ వల్ల రాష్ట్రాలకు పని ఈజీ అవుతుంది. ఎక్కడ టెస్టింగ్ పెంచాలి, ఇండ్లపై సర్వయిలెన్స్ను ఎక్కడకు పరిమితం చేయాలనేది కేసులు పెరగకముందే గుర్తించవచ్చు. ఎక్కడెక్కడ ఏ విధంగా ఆంక్షలను సడలించవచ్చ అనేది తెలుసుకోవచ్చు. కంటైన్మెంట్ స్ట్రాటజీస్ను మరింత పెంచాల్సిన అవసరం ఉందా అనేది కూడా అంచనా వేయవచ్చు. దీని ద్వారా ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ రూల్స్ను తగ్గించేందుకు ఓ మార్గం దొరకడమే కాక.. వైరస్ మరింత విస్తరించకుండా పబ్లిక్ హెల్త్కు సంబంధించి చర్యలు చేపట్టడానికి అధికారులకు అవకాశం లభిస్తుంది. వైరస్ వేగంగా విస్తరించకుండా ఒక ప్రాంతానికి ఎక్కువ కేసులను పరిమితం చేయడం అనేది లాక్డౌన్లో కంటైన్మెంట్ స్ట్రాటజీ లక్ష్యం అని హైలెవల్ టెక్నికల్ కమిటీ మెంబర్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దీని వల్ల మన దగ్గర ఉన్న పరిమిత వనరులనే బాగా ఉపయోగించుకోవడానికి, అవసరమైతే వాటిని పెంచడానికి వీలు కలుగుతుందని అన్నారు.