ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిండుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో సుమారు 40 మంది వరకు గాయపడ్డారు. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం డేరా ఘాజీ ఖాన్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది బక్రీద్ పండుగ చేసుకోవడం కోసం సొంతూర్లకు తరలి వెళ్తున్న కూలీలే ఉన్నారని అధికారులు చెప్పారు. సియాల్ కోట్ నుంచి రాజన్పూర్కు వెళ్తున్న బస్సు ఇండస్ హైవేపై వెళ్తుండగా టౌన్సా బైపాస్ దగ్గర బస్సు, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. డ్రైవర్ నిద్ర మత్రు కారణంగా సడన్గా బస్సు కంట్రోల్ తప్పిందని, అందులో ప్రయాణిస్తున్న ఓ పోలీస్ అధికారి చెప్పారు.
పాక్: బస్సును లారీ ఢీకొట్టి 30 మంది మృతి
- విదేశం
- July 19, 2021
లేటెస్ట్
- Tesla Layoffs: టెస్లా షాక్.. 2 వేల 700 మంది ఉద్యోగులను తీసేసిన ఎలన్ మస్క్
- IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం