
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన రూ.375 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు . 2023–24 బడ్జెట్లో కేటాయించిన నిధులకు అనుగుణంగా వీటిని విడుదల చేశారు. కాగా, ఇవి మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన సబ్సిడీ నిధులు అని అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోండి
కేబినెట్లో ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ టీజేఎంయూ, ఎన్ఎంయూ నేతలు హన్మంతు ముదిరాజ్, కమాల్ రెడ్డి, నరేందర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు కేటాయించాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల్లోపే వీటిని నెరవేర్చాలని కోరారు.