దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4 వేల 270 కొత్త కేసులొచ్చాయి. వైరస్ బారిన పడి మరో 15 మంది చనిపోయారు. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతానికి పెరిగింది. కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచి 13 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 2 వేల 619 మంది కోపలుకున్నారు. గత కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24 వేల 52కు పెరిగాయి. ఇప్పటివరకు 194 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం.

మరిన్ని వార్తల కోసం

పిల్లలు ఊకూకే ఫోన్ చూస్తే..

కేసీఆర్‌‌‌‌ దూకుడుకు చెక్ పెట్టేలా ప్లానింగ్​