నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మహిళలకు 486 స్థానాలు..సర్పంచ్ పదవుల్లో సగం వారికే

 నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మహిళలకు 486 స్థానాలు..సర్పంచ్ పదవుల్లో సగం వారికే
  • నిజామాబాద్​జిల్లాలో 244, కామారెడ్డి జిల్లాలో 242 
  • మూడు విడతల్లో పంచాయతీ పోరు
  • ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

నిజామాబాద్​/కామారెడ్డి, వెలుగు :  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో జరిగే ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. నిజామాబాద్​లో 244 సర్పంచ్​ స్థానాలను కేటాయించగా, కామారెడ్డిలో 242 సర్పంచ్​ స్థానాలను కేటాయిస్తూ ఇరు జిల్లాల కలెక్టర్లు వినయ్​కృష్ణారెడ్డి, ఆశిష్​సంగ్వాన్​ గెజిట్ రిలీజ్​ చేశారు.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొత్తం స్థానాల్లో రిజర్వేషన్ల పరిధి​ 50 శాతం దాటకుండా యంత్రాంగం ​పంపిన నివేదికను సర్కార్​ ఆమోదించింది. 

పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.  రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సబ్​ కలెక్టర్​/ ఆర్డీవోలు సర్పంచ్ పదవుల రిజర్వేషన్ నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు కేటాయించే పంచాయతీలను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వార్డు రిజర్వేషన్లు మండలస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణలో నిర్ణయించారు. మహిళలు పోటీచేసే వార్డులు లాటరీ ద్వారా సెలెక్ట్​ అయ్యాయి. ​  

నిజామాబాద్ జిల్లాలో.. 

జిల్లాలో కొత్తగా 15 పంచాయతీలు ఏర్పడగా, ఇదివరకు ఉన్న 530 పంచాయతీ కలుపుకుని 545 సర్పంచ్ స్థానాలు, 5,022 వార్డులకు రిజర్వేషన్ ఖరారైంది.  వంద శాతం గిరిజన జనాభాగల 71 తండాలు  ఎస్టీలకు కేటాయించారు. వాటిలో 33 మహిళలకు, 38 జనరల్​కు కేటాయించారు. నాన్​ షెడ్యూల్​ గ్రామాల్లో కూడా ఎస్టీ మహిళలకు 8, ఎస్టీ జనరల్​కు 17 రిజర్వు చేశారు. రెండు కలిపితే మొత్తం 96 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్​ చేశారు. మిగతా వాటిలో ఎస్సీ మహిళలకు 35, ఎస్సీ జనరల్​కు 47, బీసీ మహిళలకు 55, బీసీ జనరల్​కు 125 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. అన్​ రిజర్వు కేటగిరీలో మహిళలకు113, అన్​రిజర్వు జనరల్​కు 242 కేటాయించారు. 

వార్డుల వివరాలు..

జిల్లాలో మొత్తం 5,022 వార్డులు ఉండగా వంద శాతం గిరిజనులు ఉన్న తండాల్లోని 532 వార్డులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అందులో మహిళలకు 266 వార్డులు ఉన్నాయి. నాన్​ షెడ్యూల్​ గ్రామాల్లో ఎస్టీ మహిళలకు 98, ఎస్టీ జనరల్​కు 206 వార్డులు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 301, ఎస్సీ జనరల్​కు507, బీసీ మహిళలకు 437, బీసీ జనరల్​కు 670 వార్డులు రిజర్వు అయ్యాయి. అన్ రిజర్వుడ్ వార్డులు మహిళలకు 1,050, అన్​ రిజర్వుడ్​ జనరల్​కు 1221 కేటాయించారు.

ఫస్ట్​ ఫేజ్​లో బోధన్ డివిజన్​

గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదట బోధన్​ డివిజన్​లోని బోధన్​, చందూర్​, కోటగిరి, మోస్రా, రెంజల్​, వర్ని, ఎడపల్లి, నవీపేట, పోతంగల్, సాలూరా, రుద్రూర్​లో జరగనున్నాయి. సెకండ్​ ఫేజ్​లో నిజామాబాద్​ డివిజన్​లోని ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్​, సిరికొండ, జక్రాన్​పల్లిలో నిర్వహిస్తారు. మూడో ఫేజ్​లో ఆర్మూర్​ డివిజన్​లోని ఆర్మూర్​, బాల్కొండ, కమ్మర్​పల్లి, భీంగల్​, మోర్తాడ్​, మెండోరా, నందిపేట, ముప్కాల్​, ఏర్గట్ల, వేల్పూర్​, ఆలూర్​, డొంకేశ్వర్​లో  ఎన్నికలు జరగనున్నాయి. 

కామారెడ్డి జిల్లాలో.. 

కామారెడ్డి  జిల్లాలో  మొత్తం 532  పంచాయతీల్లో మహిళలకు 242, జనరల్​కు 290  కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే.. బీసీలకు  123లో మహిళలకు 55, జనరల్​ 68, ఎస్సీలకు మొత్తం 79లో మహిళలకు 35, జనరల్ 44, , ఎస్టీలకు కేటాయించిన 90 స్థానాల్లో  మహిళలకు 39, జనరల్ 51 ఉన్నాయి. జనరల్ 240 స్థానాలు కాగా మహిళలకు  113 అన్​రిజర్వుడు 127 ఉన్నాయి.  

డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. 

కామారెడ్డి  డివిజన్​లో 167 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బీసీలకు కేటాయించిన 39 స్థానాల్లో మహిళలకు 17, జనరల్​ 22,  ఎస్సీలకు కేటాయించిన 26 స్థానాల్లో మహిళలకు 12, జనరల్ 14 ,  ఎస్టీలకు కేటాయించిన 30 స్థానాల్లో మహిళలకు 14, జనరల్ 16 కేటాయించారు. ఆన్​రిజర్వుడు 63 జీపీల్లో మహిళలకు  30, జనరల్ 33 స్థానాలు దక్కాయి. బాన్సువాడ డివిజన్​లో 227 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో బీసీలకు 52 స్థానాలు కేటాయించగా మహిళలకు 23, జనరల్ 29, ఎస్సీలకు 34 కేటాయించగా మహిళలకు 15, జనరల్​ 19 రిజర్వ్​ చేశారు. ఎస్టీలకు కేటాయించిన 31 జీపీల్లో మహిళలకు  13, జనరల్ 19  రిజర్వు అయ్యాయి. అన్ రిజర్వుడు మొత్తం 104 జీపీల్లో  మహిళలకు 49, జనరల్​కు 55 కేటాయించారు. ఎల్లారెడ్డి డివిజన్​లో మొత్తం 144 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో బీసీలకు 47  స్థానాలు కేటాయించగా మహిళలకు 17, జనరల్ 30 ఉన్నాయి.  ఎస్సీలకు 19 స్థానాలు కేటాయిచగా మహిళలకు 8, జనరల్ 11 రిజర్వ్​ చేశారు.  ఎస్టీలకు 30 రిజర్వు కాగా,  మహిళలకు 14, జనరల్​ 16 స్థానాలు కేటాయించారు. అన్​రిజర్వుడ్​మొత్తం 63లో మహిళలకు 30, జనరల్​ 33 స్థానాలు దక్కాయి. దీంతో లీడర్లు భార్యలను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు.