రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్వానీ జిల్లా బండ్వాడ సమీపంలో ఓ కారు ఇంకో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.  కారులో  ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు . వీరంతా కాస్రావాడ్ లో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు.