ముంబై : రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇటీవల బయలుదేరిన 500 కిలోల కుంకుమ సోమవారం అయోధ్యకు చేరుకుంది. ఈ నెల 18న అమరావతి నుంచి రథం ఆకారంలో ఉన్న వాహనంలో కుంకుమ ఆకులను పంపామని అమరావతిలోని కేసరి ధర్మ సమాజ్ అధ్యక్షుడు జగదీశ్ గుప్తా వెల్లడించారు. ఆధ్యాత్మిక గురువు రాజేశ్వర్ మౌళి నేతృథ్యంలో ఆ వాహనం అయోధ్యకు చేరుకుందని తెలిపారు. మన దేశంలో కుంకుమ ఆకులకు సామాజిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది.