ముంబైలో 55 మ్యాచ్‌లు

ముంబైలో 55 మ్యాచ్‌లు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–15వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముంబైలో 55 లీగ్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్లాన్​ రెడీ అయినట్లు తెలుస్తోంది. వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లను షెడ్యూల్​ చేయనున్నారు. అదేటైమ్​లో రిలయన్స్‌ స్టేడియాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో 15 గ్రూప్ మ్యాచ్‌లు జరిగే చాన్సుంది.  మార్చి 26న లీగ్​ను స్టార్ట్​ చేసి  మే 29న ఫైనల్‌ నిర్వహించాలని ప్లాన్​ చేస్తున్నారు.  ఈ మొత్తం వ్యవహారంపై గురువారం జరిగే ఐపీఎల్​ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తుది నిర్ణయం వచ్చే చాన్సుంది.

మరిన్ని వార్తలు