విషాహారం పెట్టి.. 60 కుక్కల్ని చంపిన్రు

విషాహారం పెట్టి.. 60 కుక్కల్ని చంపిన్రు

శునకాలకు విషాహారం పెట్టి చంపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలికొండ మండలం అరూర్​ గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యగిరి గుట్టలో కొందరు వ్యక్తులు విషాహారం కలిపిన ఆహారాన్ని పెట్టి వీధి శునకాలకు వేశారు.  ఆ ఆహారం తిని అవి మృతి చెందాయి. 

కొద్ది రోజులుగా పశువులు, గొర్రెల్ని కరిచి చంపుతుండటంతో కుక్కల్ని చంపినట్లు తెలుస్తోంది. కాగా, చంపేసిన జీవుల్ని ట్రాక్టర్​లో తీసుకెళ్లి గ్రామ శివారులో పూడ్చిపెట్టారు. ఇదే విషయంపై సర్పంచిని వివరణ కోరగా.. ఈఘటనతో పంచాయతీకి సంబంధం లేదని, సిబ్బంది సమ్మెలో ఉన్నారన్నారు. తమ దృష్టికి రాలేదనడం గమనార్హం.