కరీంనగర్ జిల్లా ఉల్లంపల్లి ఓదెల మల్లన్న గుట్టపై రాక్ ఆర్ట్స్ 

కరీంనగర్ జిల్లా ఉల్లంపల్లి ఓదెల మల్లన్న గుట్టపై రాక్ ఆర్ట్స్ 


కరీంనగర్, వెలుగు: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో ఓదెల మల్లన్న గుడి ఉన్న గుట్ట వద్ద 6 వేల ఏళ్ల కింద కొత్తరాతియుగానికి చెందిన కొత్త రాతి చిత్రాలను తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. రాతి గోడమీద మూడు చోట్ల మూడు మూపురపుటెద్దుల తొక్కుడుబొమ్మలు(రాక్ బ్రూయిజింగ్స్) ఉన్నట్లు బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.

ఇంత పెద్దగా తొక్కుడు బొమ్మలు కనిపించడం తెలంగాణాలో రేగొండ తర్వాత ఇది రెండోదని బృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ వెల్లడించారు. ఈ రాతి చిత్రాలు సమీపంలో ఉన్న మల్లన్నగుడి ముందు 16 అడుగుల ఎత్తయిన నిలువురాయి(మెన్హర్) ఉన్నట్లు వారు తెలిపారు. 

6 వేల ఏళ్ల నాటి మూపురపు ఎద్దుల రాతిచిత్రాలు  

కొత్తరాతియుగానికి చెందిన ఈ రాక్ ఆర్ట్ తొక్కుడు బొమ్మలు 6వేల ఏండ్ల క్రితం నాటివని ఈ రాతిచిత్రాలను పరిశీలించిన నిపుణుడు, కొత్త తెలంగాణ చరిత్రబృందం సలహాదారు బండి మురళీధర్ రెడ్డి వాటి కాలాన్ని నిర్ధారించారు. చిగురుమామిడి మండలంలో చాలాచోట్ల మెగాలిథిక్ సమాధులు, అతిపెద్ద మూతరాళ్లను గతంలో చరిత్ర బృందం గుర్తించింది.