లక్షలు వసూలు చేసే ఆస్పత్రులు..వేలకు వేల ఫీజులు గుంజే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో ఫ్రీగా చూసే డాక్టర్లు ఎవరైనా ఉంటారా?.అది కూడా ఈ కరోనా సమయంలో. అవును మహారాష్ట్రలో ఓ హోమియోపతి డాక్టర్ 87 ఏళ్ల వయసులో ఇంటింటికి వెళ్లి ఫ్రీగా వైద్యం అందిస్తూ ఓరా అనిపిస్తున్నాడు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో డాక్టర్ రామ్చంద్ర దనేకర్ (87), హోమియోపతిక్ .. పేదలకు ఇంటింటికి వైద్య చికిత్స అందించడానికి రోజూ తన సైకిల్పై 10 కి.మీ చెప్పులు లేకుండా గ్రామాలు తిరుగుతున్నాడు. అతను గత 60 సంవత్సరాలుగా తన సైకిల్పై వెళ్లి పేషెంట్లను చూస్తున్నాడు. చమ్ చంద్రన్ మాట్లాడుతూ.. ‘గత 60 సంవత్సరాలుగా నేను దాదాపు ప్రతిరోజూ గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం అందిస్తున్నాను. కరోనా భయం కారణంగా పేద వారికి చికిత్స చేయటానికి వైద్యులు భయపడుతున్నారు.. కాని నాకు అలాంటి భయం లేదు. ఈ రోజుల్లో, యువ వైద్యులు డబ్బుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కానీ పేదలకు ట్రీట్ మెంట్ అందించడానికి ఇష్టపడరన్నారు
ఐపీఎల్ బెట్టింగ్.. రూ. 4 కోట్లు,19 ఫోన్లు స్వాధీనం
దేశంలో 10 కోట్లు దాటిన కరోనా టెస్టులు
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 24 ఫైరింజన్లు
.
For the last 60 years, I've been visiting villagers almost daily. Due to fear of #COVID19, doctors are scared of treating poor patients but I've no such fear. Nowadays, young doctors are only after money, they don't want to serve poor: Dr Ramchandra Danekar, Homoeopathic doctor https://t.co/tJ7p9T6QAM pic.twitter.com/meqCpGa3KV
— ANI (@ANI) October 23, 2020