చిన్నారి బోరు బావిలో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేషోపూర్ ప్రాంతంలో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్రీట్మెంట్ వేసిన బోరు పాయింట్ లో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి 40 అడుగుల లోతున్న పడిపోయిందని అధికారులు గుర్తించారు.
40 అడుగుల బోర్ వెల్ పైపు 1.5 అడుగుల వెడల్పు ఉంది. ఇన్స్పెక్టర్ ఇంచార్జీ వీర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపారు. బోరుబావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.