సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రవితేజ.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేశాడు. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. బుధవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. రవితేజ, హరీష్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ‘షాక్’ సినిమాతో హరీష్కు దర్శకుడిగా మొదటి అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మిరపకాయ్’ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.
ఆ సినిమాతో రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చాడు హరీష్. ఇక ‘ధమాకా’ తర్వాత పీపుల్స్ మీడియా సంస్థలో రవతేజ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో రానున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
