శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ల్యాండ్ మైన్ పేలి ఒక జవాన్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం కాశ్మీర్లోని నౌషేర ఏరియాలో ఎల్ వోసీ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జవాన్లలో ఒకరు ల్యాండ్ మైన్పై కాలువేయగా పేలిపోయింది.
దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.