కాశ్మీర్​లో ల్యాండ్​ మైన్ పేలి జవాన్​ మృతి

కాశ్మీర్​లో ల్యాండ్​ మైన్ పేలి జవాన్​ మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ల్యాండ్​ మైన్​ పేలి ఒక జవాన్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం కాశ్మీర్​లోని నౌషేర ఏరియాలో  ఎల్ వోసీ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జవాన్లలో ఒకరు ల్యాండ్​ మైన్​పై కాలువేయగా పేలిపోయింది.

దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆర్మీ హాస్పిటల్​కు తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.