
దీపావళి సందర్భంగా మొదటిసారి వచ్చిన కొత్త అల్లుడికి అత్తామామలు సర్ప్రైజ్ ఇచ్చారు. 150కి పైగా వెరైటీలతో విందు భోజనం ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. వనపర్తి జిల్లా పానుగల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతురు శిరీషకు అదే గ్రామానికి చెందిన మహంకాళి మహేశ్తో ఐదు నెలల కింద వివాహమైంది. దీపావళి సందర్భంగా మహేశ్ అత్తగారింటికి రావడంతో వివిధ రకాల వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు.
పానుగల్, వెలుగు