ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ లో ఎయిర్ ఇండియా ఏఐ 630 విమానం నాగ్ పూర్ నుంచి ముంబయి కి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ మహిళా ప్యాసెంజర్ ని తేలు కుట్టింది. గమనించిన సిబ్బంది ప్రథమ చికిత్స చేసి, విమానం ల్యాండ్ అయ్యాక ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
దురదృష్టకర ఘటన...
ఈ అంశంపై స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని తమ ప్యాసింజర్లకు హామీ ఇచ్చింది. బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కాగా ఇదివరకే ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు జరగటం గమనార్హం.