ప్రాణాలకు తెగించి యువకుడిని రక్షించిన పోలీసు

ప్రాణాలకు తెగించి  యువకుడిని రక్షించిన పోలీసు

మహారాష్ట్ర: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన ఓ యువకుడిని రక్షించాడు రైల్వే పోలీసు. మహారాష్ట్రలోని విఠల్ వాడీ రైల్వే స్టేషన్ లో యువకుడు పట్టాలపైకి దూకాడు. వెంటనే గమనించిన పోలీస్.. ప్రాణాలకు తెగించి ఆ యువకుడిని పట్టాలపై నుంచి తప్పించాడు. అటు నుంచి రైలు వేగంగా వస్తున్నా ఏమాత్రం ఆలోచించకుండా రెప్పపాటు సమయంలో పట్టాలపై దూకి అతడిని రక్షించాడు. అయితే అప్పుడు ట్రైన్ రావడంతో అంతా ప్రమాదం జరిగి ఉంటుందా అని భయంతో కేకలు వేశారు. రైలు వెళ్లాక ఇద్దరు క్షేమంగా కనిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సెకన్ల వ్యవధిలోనే జరిగింది. ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన రైల్వే పోలీసును అక్కడున్నవారు, అధికారులు ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసు చేసిన మంచి పనికి కితాబిస్తున్నరు నెటిజన్లు.