ముంబై ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబై ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబై : ముంబై ఎయిర్పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. పుష్ బ్యాక్ వ్యాన్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎయిరిండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ - 647 ముంబై నుంచి జామ్ నగర్ కు వెళ్లేందుకు సిద్ధంకాగా.. దానికి సమీపంలోనే ఉన్న పుష్ బ్యాక్ వ్యాన్లో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. 10 నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్ లో 85 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్లైట్ 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. అధికారులు ఫైర్ యాక్సిడెంట్పై విచారణకు ఆదేశించారు.  

మరిన్ని వార్తల కోసం...

 

ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు