కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధించాలని సీఎం ఆదేశించారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్ తప్పనిసరి ధరించాలని ఆదేశించింది. మాస్క్ లు ధరించకపోతే జరిమానా కొనసాగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్ లో 100 మంది మించకూడదని ఆదేశించారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
Andhra Pradesh Govt caps occupancy in theaters at 50%, to allow maximum 100 people in indoor public gatherings and 200 at outdoor gatherings; penalty of Rs 100 for not wearing mask to be strictly enforced
— ANI (@ANI) January 10, 2022