ఆన్లైన్లో రూ.2 లక్షలు పోగొట్టుకున్న మహిళ

ఆన్లైన్లో రూ.2 లక్షలు పోగొట్టుకున్న మహిళ

నిర్మల్, వెలుగు: నిర్మల్ కు చెందిన ఓ మహిళ ఆన్​లైన్​లో ఓ వస్తువు కొని అది నచ్చక రిటర్న్​పంపే క్రమంలో రూ.2 లక్షలు పోగొట్టుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం..కొద్దిరోజుల కింద  ఓ మహిళ ఆన్​లైన్​ కామర్స్​ వెబ్​సైట్​లో ఓ వస్తువు కొనుగోలు చేసింది. నచ్చక పోవడంతో దానిని రిటర్న్ చేసేందుకు రిక్వెస్ట్​ పెట్టుకుంది. తర్వాత ఆమెకు షాపింగ్ ఏజెంట్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్​చేసిన వ్యక్తి  ‘మీ వస్తువు రిటర్న్​చేయాలంటే కొన్ని డిటెయిల్స్​ కావాలి. మీకో లింక్​ పంపిస్తాను. అందులో మీ వివరాలన్నీ ఇవ్వండి’ అని లింక్​పంపించాడు. ఆ లింక్ ​ఓపెన్​ చేసి వస్తువుకు సంబంధించిన వివరాలు పంపించారు. వెంటనే ఆమె అకౌంట్​లోని రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. షాక్​కు గురైన ఆమె వెంటనే పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేశారు. దీన్ని మోసంగా గుర్తించిన సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.