విహారయాత్రలో విషాదం.. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ గుండెపోటుతో మృతి

విహారయాత్రలో విషాదం.. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ గుండెపోటుతో మృతి

భైంసా, వెలుగు: విహారయాత్రకు నేపాల్​వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి చెందారు. నిర్మల్​జిల్లా భైంసా టౌన్‎కు చెందిన 12 జంటలు విహారయాత్రకు గతనెల 31న నేపాల్ వెళ్లాయి. తిరిగొస్తూ బిహార్‎లోని పాట్నా రైల్వే స్టేషన్​ఏరియాలోని లాడ్జిలో బస చేసేందుకు ఆగారు. సోమవారం ఉదయం లాడ్జి పక్కన హోటల్‎లో టీ తాగుతుండగా బచ్చువార్​సంగీత(41) ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయింది.

ఆమె భర్త మహేశ్‎తో కలిసి తోటి పర్యాటకులు సంగీతను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విహారయాత్రలో విషాదం చోటు చేసుకోగా.. భార్య మృతితో భర్త విలపించిన తీరు స్థానికులకు కంటనీరు పెట్టించింది. మహిళ డెడ్ బాడీని అంబులెన్స్‎లో భైంసాకు తీసుకొచ్చారు.