పెళ్లాడిన యువతి కాదన్నదని  యువకుడి ఆత్మహత్యాయత్నం

పెళ్లాడిన యువతి కాదన్నదని  యువకుడి ఆత్మహత్యాయత్నం
  •     సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగిన యువకుడు

లింగాల, వెలుగు:  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనకు ఆ పెళ్లి ఇష్టం లేదనడంతో  యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్త కుంటపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని దేవాలయంలో కొంతమంది మిత్రుల సాయంతో ఫిబ్రవరి 2 వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారిద్దరిని పిలిపించి  పెద్దల సమక్షంలో పది రోజుల్లో పెళ్లి ఘనంగా చేస్తామని అంగీకార పత్రం రాసుకున్నారు.

పది రోజులు పూర్తయిన తర్వాత అమ్మాయి బంధువులు స్పందించకపోవడంతో తెలకపల్లి పోలీస్ స్టేషన్​ లో యువకుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఇరువురిని పిలిపించి కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.  అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పి ఆ అమ్మాయిని బంధువుల ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. అమ్మాయిని భయబ్రాంతులకు గురి చేశారని బలవంతంగా అమ్మాయితో ఇష్టం లేదని చెప్పించారని ఆరోపిస్తూ ఆంజనేయులు బుధవారం రాత్రి పురుగులమందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు మొదట అచ్చంపేట ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం నాగర్​ కర్నూల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  తన కుమారుడికి న్యాయం జరిపించాలని యువకుడి తల్లి వెంకటమ్మ మొరపెట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది