
సుధీర్ బాబు, కృతిశెట్టి ప్రధాన పాత్రలలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కలిసి సంయక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. యాక్టర్ అవ్వాలనుకునే ఓ డాక్టర్ స్టోరీనే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, కళ్యాణి నటరాజన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా,తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.