
- డోర్ఫ్రేమ్ డిటెక్టర్ల స్థానంలో ఏర్పాటు
- ప్యాసింజర్లను తాకే అవసరం తప్పుతుంది
- సగమవనున్న ఫ్రిస్కింగ్ టైమ్
న్యూఢిల్లీ : దేశంలోని కోల్కతా, చెన్నై, పుణె, గోవా ఎయిర్పోర్టులలో ఫుల్బాడీ స్కానర్లను ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టులలో ఇప్పటిదాకా ఉన్న డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ ప్లేస్లో ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశించింది. దేశంలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఎయిర్పోర్టులలో ఫుల్బాడీ స్కానర్ల ఏర్పాటు తప్పనిసరని స్పష్టం చేసింది. మార్చి 2022 నాటికే అన్ని హైపర్సెన్సిటివ్, సెన్సిటివ్ ఎయిర్పోర్టులలోను ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటు పూర్తి కావాలని బీసీఏఎస్ ఆదేశించింది. నవంబర్ 2021 లో ఈ ఆదేశాలను జారీ చేసింది. కానీ, ఫుల్ బాడీ స్కానర్లను సమకూర్చుకోవడంలో ఏడాదికి పైగా ఆలస్యం జరిగింది. పైన చెప్పిన 4 ఎయిర్పోర్టులలో ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటుకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు నుంచి సెప్టెంబర్ 13 నాడు ఏఏఐ కి అనుమతి వచ్చింది. కోల్కతా ఎయిర్పోర్టులో 13, చెన్నై ఎయిర్పోర్టులో 12, గోవా ఎయిర్పోర్టులో 8, పుణె ఎయిర్పోర్టులో 5 ఫుల్బాడీ స్కానర్లను ఏర్పాటు చేయనున్నారు.
జులైలోనే టెండర్లు....
131 ఫుల్ బాడీ స్కానర్ల కొనుగోలుకు ఈ ఏడాది జులై నెలలోనే ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఏఏఐ అధీనంలోని ఎయిర్పోర్టులలో ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటు కోసమే ఈ టెండర్లను పిలిచారు. వాటి కొనుగోలుకు రూ. 1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు నుంచి అనుమతి లేకపోవడంతో ఆ టెండర్లను తర్వాత ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది.
84 ఎయిర్పోర్టులలో ఫుల్బాడీ స్కానర్లు పెట్టాల్సిందే...
దేశంలోని 84 ఎయిర్పోర్టులలో ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాల్సిందేనని బీసీఏఎస్ ఏప్రిల్ 2019 లో ఆదేశాలు జారీ చేసింది. మార్చి 2020 నాటికల్లా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ల పేస్లో ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మిగిలిన ఎయిర్పోర్టులలో 2021 నాటికల్లా ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 198 ఫుల్ బాడీ స్కానర్ల కొనుగోలుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ను కూడా జారీ చేసింది. కానీ, కొవిడ్ సహా వివిధ కారణాల వల్ల కొనుగోలు ప్రక్రియ బాగా ఆలస్యమైంది.
ప్యాసింజర్ ఫ్రిస్కింగ్ టైము తగ్గుతుంది...
ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ప్యాసింజర్ల ఫ్రిస్కింగ్కు పట్టే టైము కూడా సగానికి తగ్గుతుంది. సాధారణ ఫ్రిస్కింగ్కు ఒక్కో ప్యాసింజర్కు 30 సెకండ్లు అవసరమైతే, ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ఆ టైము 15 సెకండ్లకు తగ్గిపోతుంది. అదనంగా 600 కొత్త హ్యాండ్ బ్యాగేజ్ స్కానర్లను కూడా నెలకొల్పుతారు.
రూ. 1,000 కోట్ల ఖర్చు....
రూ. 1,000 కోట్ల ఖర్చుతో 43 ఎయిర్పోర్టులలో 131 ఫుల్ బాడీ స్కానర్లు, 600 కొత్త హ్యాండ్ బ్యాగేజ్ స్కానర్ మెషిన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ 43 ఎయిర్పోర్టుల జాబితాలో అమృత్సర్, గోవా, శ్రీనగర్, జమ్ము, లే, వారణాసి, చెన్నై, పుణె, కోల్కతా, రాయ్పుర్, తిరుపతి, భోపాల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి.
ప్యాసింజర్లను తాకే అవసరం తప్పుతుంది...
ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటుతో ప్యాసింజర్ల శరీరాలను తాకాల్సిన అవసరం తప్పుతుంది. ప్రైమరీ స్క్రీనింగ్ తర్వాత మెటల్ డిటెక్టర్ నుంచి ప్యాసింజర్లు నడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత క్లీన్ ప్యాసింజర్లను ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఇతర ప్యాసింజర్లకు మాత్రమే ఫ్రిస్కింగ్ అవసరం పడుతుంది. మన దేశంలో వస్త్రధారణ (చీరలు, లుంగీలు, పల్లు) ను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనువైన ఫుల్బాడీ స్కానర్లకు స్పెసిఫికేషన్స్ నిర్ణయించారు.