గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి ఓటమి పాలయ్యారు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్భాయ్ బేరాపై 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇసుదాన్ గాధ్వి 53,583 ఓట్లు రాగా, బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి.
ఇసుదన్ గాధ్వి మొదట దూరదర్శన్లో పని చేశారు. ఆ తర్వాత జర్నలిస్టుగా మరారు. 2021 లో ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరారు. ఇసుదన్ గాధ్విని గుజరాత్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. అటు గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. ఆయన పై బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా విజయం సాధించారు.