కామారెడ్డి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం, క్రీడలు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆస్మిత ఖేలో ఇండియా లీగ్ టాలెంట్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు.
వివిధ పోటీల్లో గెలిచిన క్రీడకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో అబ్జర్వర్ స్వాములు, ఆశ్విని, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ రంగా వెంకటేశ్వర్గౌడ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సెక్రటరీ అనిల్కుమార్, ఎస్జీఎఫ్ సెక్రటరీ హీరాలాల్, ప్రతినిధులు నాగరాజు, దత్తాత్రి, నవీన్, శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, రేణుక పాల్గొన్నారు.
