కేటీఆర్​.. జాబ్స్​ ఎక్కడ?    

కేటీఆర్​.. జాబ్స్​ ఎక్కడ?    

జాబ్​నోటిఫికేషన్స్​ఇవ్వకుండా యువతను మోసం చేశారంటూ ఏబీవీపీ, బీజేవైఎం నేతలు మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ని అడ్డుకున్నారు. బుధవారం నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట పర్యటనకు వచ్చిన కేటీఆర్‌‌‌‌ పట్టణంలో ని అంబేద్కర్​ చౌరస్తాలో రోడ్​ షో నిర్వహిస్తుండగా బీజేవైఎం, ఏబీవీపీ నేతలు శ్రీకాంత్​రాజ్యన్, దేవేందర్​నాయక్​, చందర్​నాయక్, మధు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గత హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రజలను మోసగించేందుకు వచ్చారా.. అంటూ కేటీఆర్​వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.  గత అచ్చంపేట మున్సిపల్​ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారంటూ ఈ సందర్భంగా యువకులు నినాదాలు చేశారు.  కేటీఆర్​ ప్రోగ్రాం ముగిసేవరకు ఏబీవీపీ, బీజేవైఎం నేతలను పోలీస్​ స్టేషన్​లోనే ఉంచి అనంతరం వదిలిపెట్టారు. 

కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

మంత్రి కేటీఆర్​జడ్చర్ల పర్యటన నేపథ్యంలో బుధవారం జడ్చర్ల, మక్తల్, కందనూలులో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్​ చేశారు. జడ్చర్లకు చెందిన బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్​ అధ్యక్షులు పాలాది రామ్మోహన్ తో పాటు 20 మంది ఏబీవీపీ కార్యకర్తలను పట్టణ శివారులోని పోలీస్​ట్రైనింగ్​సెంటర్​కు తరలించడం పట్ల పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అదేవిధంగా మిడ్జిల్, నవాబుపేట, బాలానగర్, రాజాపూర్​మండల కేంద్రాల్లోని బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్​చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్​మాట్లాడుతూ అరెస్టులతో ఆందోళనలను అడ్డుకోలేరన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే కేసీఆర్​ కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చాడన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుంటే బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి హౌస్‌‌ అరెస్ట్
 
ఉప్పునుంతల, వెలుగు:  ఉద్యోగాల కోసం అచ్చంపేటలో  కేటీఆర్​పర్యటనను అడ్డుకుందామని పిలుపునిచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్​మాదిగను వంగూరు పోలీసులు హౌస్​అరెస్ట్ చేశారు.  బుధవారం చారగొండలో  2 గంటలకు  అరెస్ట్ చేసి ఉప్పునుంతల మండలంలోని కొరిటికల్‌‌కు తరలించి గృహనిర్బంధం లో ఉంచారు. ఈ సందర్భంగా సతీశ్​ మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేవని అన్నారు. జాబ్స్​లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినా నిరుద్యోగ యుద్ధం ఆగదని ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగలైనా ఇవ్వండి, లేక కార్పొరేషన్ లోన్స్ అయినా ఇవ్వాలని డిమాండ్​చేశారు. మే నెల చివరి వారం  అచ్చంపేటలో నిరుద్యోగ గర్జన సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.