ఈఈ శ్రీధర్ బినామీలపై ఏసీబీ ఫోకస్‌‌‌‌‌‌‌‌

ఈఈ శ్రీధర్ బినామీలపై ఏసీబీ ఫోకస్‌‌‌‌‌‌‌‌
  • సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బినామీ ఆస్తులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  శ్రీధర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా బినామీలను గుర్తిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు  శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కస్టడీకి తీసుకుని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేందుకు గురువారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.

కాళేశ్వరం  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలోని  బాహుబలి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ ఇన్​చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీధర్‌‌‌‌‌‌‌‌పై.. ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా బుధవారం 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే సీజ్‌‌‌‌‌‌‌‌చేసిన ఆభరణాలు సహా ఇతర స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన అవినీతి సంపాదనతో బినామీల పేర్లతో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే గుర్తించిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌ వ్యాల్యూ ప్రకారం రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇవే కాకుండా బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లాకర్లు, బంగారు ఆభరణాల లెక్కలు తేల్చితే అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు.