ఏసీడీ పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుంది : వివేక్ వెంకటస్వామి

ఏసీడీ పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుంది : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కరెంట్ బిల్లుల అదనపు చార్జీలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ నెల కరెంట్ ​బిల్లుల్లో అడిషనల్​ కన్జంప్షన్​ డిపాజిట్ (ఏసీడీ) చార్జీలను డిస్కంలు వేశాయి. రెగ్యులర్​ బిల్లుకు మూడు నాలుగు రెట్లు ఈ చార్జీలు ఉన్నాయి. అయితే వీటిని వెంటనే రద్దు చేయాలని వివేక్ వెంకటస్వామి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పటికే పెంచిన కరెంటు బిల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ అదనంగా ఏసీడీ పేరుతో వేలల్లో బిల్లు వేసి దోచుకుంటుందని ఆరోపించారు. ఈ ట్విట్కు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.  

మరోవైపు ఇష్టమున్నట్లు కరెంటు బిల్లులను పెంచడం, రకరకాల పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేయడంపై జనం మర్లవడ్తున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. బిల్లుల వసూళ్లకు వచ్చే కరెంటోళ్లను నిలదీస్తున్నారు. ఈ నెల కరెంట్​బిల్లుల్లో అడిషనల్​కన్జంప్షన్​ డిపాజిట్(ఏసీడీ) చార్జీలను డిస్కంలు వేశాయి. రెగ్యులర్​ బిల్లుకు మూడు నాలుగు రెట్లు ఈ చార్జీలు ఉన్నాయి. దీంతో జనం మండిపడుతున్నారు. ఇప్పటికే  రెగ్యులర్​ బిల్లులను ఇష్టమున్నట్లు పెంచి.. ఇప్పుడు కొత్తగా డిపాజిట్​పేరుతో వేలకు వేలు వసూలు చేయడం ఏందని  నిలదీస్తున్నారు. ఒక్క నెల బిల్లు కట్టకున్నా కనెక్షన్​ కట్​ చేస్తున్నారని, అట్లాంటిది రెండు, మూడు నెలల బిల్లును అడ్వాన్స్​గా డిపాజిట్​చేయాలంటే ఎక్కడినుంచి తేవాలని వారు  ప్రశ్నిస్తున్నారు. ఏసీడీ చార్జీలు రద్దు చేసే వరకు కరెంట్ బిల్లులు కట్టే ప్రసక్తి లేదంటూ గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు.