
ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ (ఏఐ) ఫీచర్లతో స్విఫ్ట్ గో 14 ల్యాప్టాప్ను ఏసర్ తీసుకురానుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), ఇంటెల్ ఏఐ బూస్ట్ ప్రాసెసర్ను ఇందులో అమర్చామని కంపెనీ పేర్కొంది. ఏసర్ ప్యూరిఫైడ్ వ్యూ, ఏసర్ ప్యూరిఫైడ్ వాయిస్ వంటి ఏఐ ఫీచర్లను యూజర్లు వాడుకోవచ్చని తెలిపింది. త్వరలో ఇండియాలో ఈ ల్యాప్టాప్ను లాంచ్ చేయనుంది. ధర రూ.66 వేల దగ్గర ఉండొచ్చు.