ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ ​దాడి .. కేరళలో దారుణం

ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ ​దాడి ..  కేరళలో దారుణం

మంగళూరు: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులపై ఓ యువకుడు యాసిడ్​దాడికి పాల్పడ్డాడు. దక్షిణ కన్నడ జిల్లా కడబ టౌన్​లోని ప్రభుత్వ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడిని కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్‌‌కు చెందిన అబిన్ శిబి (23)గా పోలీసులు గుర్తించారు. విద్యార్థినులు కళాశాల కారిడార్‌‌లో కూర్చొని ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్షలకు సిద్ధమవుతున్న టైంలో యువకుడు వచ్చి వారిపై యాసిడ్ ​పోశాడు. 

దీంతో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనున్న ఇద్దరు బాలికలకు స్వల్ప కాలిన గాయాలు అయ్యాయి. యువకుడు తలకు టోపీ, ముఖానికి ముసుగు ధరించి వచ్చాడు. దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, అందులో ఒక అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.